వైసీపీ నన్ను మెసం చేసింది
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:04 PM
గత ఎన్నికలలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ గెలుపునకు, వైసీపీ అధికారంలోకి రావడానికి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పార్టీని గెలిపించామని, కాని తమకు తగిన గుర్తింపు లేకపోగా ఆర్థికంగా చితికిపోయామని మండలంలోని మెగుళ్లూరు పంచాయతీకి చెందిన మండల వైసీపీ నాయకులు కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మొగళ్లూరు గ్రామ నేత వెంకటేశ్వరరెడ్డి
వెలిగండ్ల, మార్చి 6 : గత ఎన్నికలలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ గెలుపునకు, వైసీపీ అధికారంలోకి రావడానికి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పార్టీని గెలిపించామని, కాని తమకు తగిన గుర్తింపు లేకపోగా ఆర్థికంగా చితికిపోయామని మండలంలోని మెగుళ్లూరు పంచాయతీకి చెందిన మండల వైసీపీ నాయకులు కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగండ్లలో బుధవారం ఆయన నాయకులతో కలిసి మాట్లాడారు. తనను వైసీపీ మోసం చేసినందుకు పార్టీ మారుతున్నట్లు చెప్పారు. కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా ఉగ్ర నరసింహరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. వైసీపీని వీడి ఈ నెల 14వ తేదిన ఉగ్ర నరసింహా రెడ్డి సమక్షంలో తన అనుచరులతో టీడీపీ పార్టీలో చెరుతున్నట్లు తెలిపారు.