Share News

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు

ABN , Publish Date - May 15 , 2024 | 11:35 PM

ఎన్నికలలో ఓటమి భయంతోనే టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే, టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల సందర్భంగా సంతమాగులూరు మండలం మిన్నెకల్లులో వైసీపీ నేతల దాడిలో గాయపడి నర్సరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న కంభంపాటి పెద్దరామయ్య, కంకి సలోమాన్‌, మాణిక్యరావు, పూర్ణయ్య, జిర్రా విజయ్‌భాస్కర్‌, భాగ్యరాజు, రాజేష్‌ను రవికుమార్‌ బుధవారం పరామర్శించారు.

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు
నర్సరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న నేతలను పరామర్శిస్తున్న గొట్టిపాటి రవికుమార్‌

ఎమ్మెల్యే గొట్టిపాటి

సంతమాగులూరు (అద్దంకి), మే 15 : ఎన్నికలలో ఓటమి భయంతోనే టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే, టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల సందర్భంగా సంతమాగులూరు మండలం మిన్నెకల్లులో వైసీపీ నేతల దాడిలో గాయపడి నర్సరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న కంభంపాటి పెద్దరామయ్య, కంకి సలోమాన్‌, మాణిక్యరావు, పూర్ణయ్య, జిర్రా విజయ్‌భాస్కర్‌, భాగ్యరాజు, రాజేష్‌ను రవికుమార్‌ బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి, వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వైసీపీ నేతలు దాడులకు పాల్పడి వాళ్ల ఓటమిని వాళ్లే ముందే అంగీకరించారన్నారు. వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయటం సరికాదన్నారు. పోలీసుల భద్రతా వైఫల్యంతోనే వైసీపీ నేతలు బరితెగించారని అన్నారు. పరామర్శించిన వారిలో అట్లా చిన వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - May 15 , 2024 | 11:35 PM