Share News

తెల్లగాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

ABN , Publish Date - May 27 , 2024 | 10:47 PM

చీరాల పట్టణంలో చారిత్రాత్మక తెల్లగాంధీ విగ్రహంపై గుర్తుతెలియని ఆగంతుకులు దాడి చేశారు.

తెల్లగాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
సీఐ శేషగిరిరావుకు ఫిర్యాదు చేస్తున్న ప్రతినిధులు

పాక్షికంగా ధ్వంసమైన చేయి, చేతికర్ర, మెట్లు

చీరాలటౌన్‌, మే27 : చీరాల పట్టణంలో చారిత్రాత్మక తెల్లగాంధీ విగ్రహంపై గుర్తుతెలియని ఆగంతుకులు దాడి చేశారు. దీంతో గాంధీజీ కుడిచేయి మణికట్టు, చేతికర్ర, విగ్రహంకు సంబంధించిన మెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి జరిగింది. దీంతో వాసవీ క్లబ్‌ చీరాల కమిటీ ప్రతినిధులు ఆదివారం రాత్రి చీరాల వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే తరహాలో ఘటనలు జరిగాయని, కచ్చితంగా దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని క్లబ్‌ ప్రతినిధులు కోరారు. ఈ క్రమంలోవన్‌టౌన్‌ సీఐ శేషగిరిరావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ ఆ పరిసరాల్లోని సీసీ కెమెరా తదితర అంశాలను పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - May 27 , 2024 | 10:48 PM