వైసీపీని సాగనంపేందుకు కంకణబద్ధులు కావాలి
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:21 PM
రాష్ట్రాన్ని వైసీపీ కబంధ హస్తాల నుంచి కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని, తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివా రం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో హైదరాబాద్లో నివాసం ఉంటున్న పర్చూరు నియోజకవర్గ ఓటర్లు, ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తా
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు, మార్చి 3: రాష్ట్రాన్ని వైసీపీ కబంధ హస్తాల నుంచి కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని, తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివా రం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో హైదరాబాద్లో నివాసం ఉంటున్న పర్చూరు నియోజకవర్గ ఓటర్లు, ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఏలూరి మాట్లాడుతూ రా ష్ట్రాన్ని నాశనం చేసిన సీఎం జగన్ మోహన్రెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపు నిచ్చారు.
పర్చూరు నియో జకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలిగించేందుకు వైసీపీ చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని ఏలూరి పేర్కొన్నారు. ఓట్లు తొలగించేందుకు వైసీపీ చేసిన కుట్రలను తిప్పికొట్టి ప్రతి ఓటరు ఓటును కాపాడుకునేం దుకు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి చూసిన తెగువ, ధైౖర్యాన్ని అభినందించారు. తాడేపల్లి, అనంతపురంలో చేసిన కుట్రలు పర్చూరులో పనిచేయలేద న్నారు. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చూసినా జగన్కు చమ టలు పట్టాయాన్నారు. పర్చూరు ప్రజల చైతన్యం ముందు జగన్ కుట్రల న్నీ ఫెయిల్ అయ్యాయన్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగిం చాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్కు ఓటే వజ్రాయుధంగా పనిచేస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
నవ్యాంధ్ర రాష్ట్ర భవిష్యత్కు బాబు విజన్, అనుభవం అవసరమని ఎ మ్మెల్యే ఏలూరి అన్నారు. ఆనాడు బాబు విజన్, అనుభవంతోనే హైదరా బాద్లో వేసిన బాటలే నేడు ప్రగతి ఫలాలను అందిస్తున్నాయన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.