Share News

రామోజీరావుకు ఘన నివాళి

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:13 AM

ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం పార్టీశ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. శనివారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయ్‌కుమార్‌, ముత్తుముల అశోక్‌రెడ్డితోపాటు, వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

రామోజీరావుకు ఘన నివాళి
ఒంగోలులో రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు

ఒంగోలులో టీడీపీ నేతల సంతాపం

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 8 : ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం పార్టీశ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. శనివారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయ్‌కుమార్‌, ముత్తుముల అశోక్‌రెడ్డితోపాటు, వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రామోజీరావు మరణం అందరినీ కలిచివేసిందన్నారు. తెలుగు పాత్రికేయతకు రామోజీరావు విశ్వసనీయత జోడించారని, మీడియా రంగానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని తూర్పుకమ్మపాలెంలో 7, 8 డివిజన్‌ పరిధిలోని పార్టీశ్రేణులు రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, సండ్రపాటి వర్డ్స్‌వర్త్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 01:13 AM