Share News

నలుగురు తహసీల్దార్ల బదిలీ

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:20 AM

జిల్లాలో నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నలుగురు తహసీల్దార్ల బదిలీ

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఉత్తర్వులు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 27 : జిల్లాలో నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మద్దిపాడులో పనిచేస్తున్న డి.వెంకటేశ్వర్లును రాచర్లకు, ఒంగోలు రూరల్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎం.డానియేలును వెలిగండ్లకు బదిలీ చేశారు. హనుమంతుని పాడులో పనిచేస్తున్న ఎన్‌.రమాదేవిని ఒంగోలు ఆర్డీవో కార్యాలయ కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ తహసీల్దార్‌గా, ఆర్డీవో కార్యాలయ కేఆర్‌ఆర్‌సీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న పి.అనురాధను మద్దిపాడు తహసీల్దార్‌గా నియమించారు.

Updated Date - Feb 28 , 2024 | 01:20 AM