Share News

తిరుపతమ్మ, గోపయ్యస్వామి కల్యాణంలో పాల్గొన్న కొండయ్య

ABN , Publish Date - May 30 , 2024 | 11:14 PM

టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య గురువారం నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేటపా లెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో నిర్వహించిన తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామి కల్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాల్లో కొండయ్య పా ల్గొన్నారు.

తిరుపతమ్మ, గోపయ్యస్వామి కల్యాణంలో పాల్గొన్న కొండయ్య
కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య

వేటపాలెం(చీరాల), మే 30 : టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య గురువారం నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేటపా లెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో నిర్వహించిన తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామి కల్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాల్లో కొండయ్య పా ల్గొన్నారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కొండయ్యను ఘనంగా సత్కరించారు. ఆయన వెంట టీడీపీ సీనియర్‌ నాయకుడు నాశిక వీరభద్రయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉ న్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

కొత్తపేట శ్రీనివాసపురంలో వెంకటేశ్వర సప్లయర్స్‌ వారి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కొండయ్య సందర్శించారు. మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చీరాల బెస్తపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెడీమేడ్‌ వస్త్ర దుకాణాన్ని కొండయ్య సందర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:14 PM