Share News

విజేత ఏలూరి

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:18 AM

ప్రజా కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘన విజయం సాధించారు. మంగళవారం ఉత్కంఠంగా సాగిన ఎన్నికల లెక్కింపులో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి యడం బాలాజీపై 24,138 ఓట్లతో హ్యాట్రిక్‌ విజయం సాధించారు.

విజేత ఏలూరి
ఎన్నికల అధికారి నుంచి ధ్రువపత్రం అందుకుంటున్న ఎమ్మెల్మే ఏలూరి

పర్చూరు, జూన్‌ 4: ప్రజా కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘన విజయం సాధించారు. మంగళవారం ఉత్కంఠంగా సాగిన ఎన్నికల లెక్కింపులో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి యడం బాలాజీపై 24,138 ఓట్లతో హ్యాట్రిక్‌ విజయం సాధించారు. మొత్తం 2,29,333 కాగా, పోలైన ఓట్లు 2,02,030 వాటిలో ఏలూరికి 1,10,575 ఓట్లు రాగా, ప్రత్యర్థి యడం బాలాజీకి 86,562 ఓట్లు వచ్చాయి. మొత్తం పోస్టల్‌ ఓట్లు 2679 కాగా, ఏలూరికి 1634, బాలాజీకి 991 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నల్లగొర్ల శివశ్రీలక్ష్మీజ్యోతికి 2275 ఓట్లు పోలయ్యాయి. దీంతో 24,138 ఓట్ల మెజార్జీతో కూటమి అభ్యర్థి ఏలూరి విజయం సాధించారు.

Updated Date - Jun 05 , 2024 | 12:18 AM