టీడీపీతోనే ముస్లింల సంక్షేమం
ABN , Publish Date - Feb 28 , 2024 | 01:27 AM
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. మంగళవారం గిద్దలూరులోని షాదీఖానాలో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
![టీడీపీతోనే ముస్లింల సంక్షేమం](https://media.andhrajyothy.com/media/2024/20240227/Gdl_8fe203de4d.jpg)
శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్
అశోక్రెడ్డి గెలుపునకు కృషిచేయాలి
గిద్దలూరులో ముస్లింల ఆత్మీయ సమావేశం
భారీగా హాజరైన మైనారిటీలు
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. మంగళవారం గిద్దలూరులోని షాదీఖానాలో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి షరీఫ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. నేడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని మరచి వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. ముస్లింలపై వైసీపీ మూకలు దాడి చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనను తరిమికొట్టేందుకు ముస్లింలు సిద్ధంగా ఉండాలన్నారు. టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానిముస్తక్ అహమ్మద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. జగన్రెడ్డిని ఇంటికి సాగనంపాలని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ముత్తుముల అశోక్రెడ్డి మాట్లాడుతూ తాను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ముస్లింల సంక్షేమానికి కృషిచేశానన్నారు. అప్పట్లో షాదీఖానాల నిర్మాణానికి నిధులు కేటాయించామని తెలిపారు. నియోజకవర్గంలోని ముస్లింలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బలపరచిన తనను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాన్షావలి, ముస్లిం నాయకులు పెద్దబాషా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.