Share News

టీడీపీ బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:33 PM

టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నా రు. పెద్దగంజాం మండలం పెద్దపల్లిపాలెం నుంచి తె లుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు. శనివారం మా ర్టూరు మండలం ఇసుకదర్శిలోని క్యాంపు కార్యాలయంలో ఏలూరి వారికి పార్టీ కండువాలు కల్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూట మి విజయం తథ్యమన్నారు.

టీడీపీ బలోపేతమే లక్ష్యం

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, మార్చి 16: టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నా రు. పెద్దగంజాం మండలం పెద్దపల్లిపాలెం నుంచి తె లుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు. శనివారం మా ర్టూరు మండలం ఇసుకదర్శిలోని క్యాంపు కార్యాలయంలో ఏలూరి వారికి పార్టీ కండువాలు కల్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూట మి విజయం తథ్యమన్నారు. భారీ మెజారిటీతో తెలుగుదేశం ప్ర భుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. సంక్షేమ పాలన అందిస్తామన్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయన్నారు. మత్యకారుల సంక్షేమానికి తె లుగుదేశం పార్టీ విశేష కృషిచేస్తుందని చెప్పారు. అ ర్హులైన ప్రతి ఒక్కరికి వలలు, బోట్లు, పడవలు, ఐస్‌ బాక్సులు సబ్సిడీపై అందిస్తామన్నారు.

పార్టీలో చేరిన వారిలో కొల్లాటి సుబ్బారావు, కొల్లాటి బ్రహ్మయ్య, కనక శ్రీను, గోపి, బాలరాజు, సత్యనారా యణ, నాగరాజు, కృష్ణ, నాయుడు ఏడుకొండలు, వెంకటేష్‌, వాటిపల్లి ఆంజనేయులు, వీరాస్వామి, పోలయ్య, వెంకటసుబ్బారావు, మీరా సాహెబ్‌ నాయుడు, నాయుడు సుబ్బారావు, వాటిపల్లి శ్రీను, దండుప్రోలు వెంకటేశ్వర్లు, పీత సునీత, వల్లభనేని అదేమ్మ, దుర్గ, లక్ష్మీ, సాంబమ్మ, తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో ఎంపీటీసీ పీత భార్గవి, మాజీ ఎంపీటీసీలు కొక్కిలిగడ్డ రాములు, షేర్‌ వెంకటేశ్వర్లు, నాయకులు దండుప్రోలు బాలరాజు, వాటుపల్లి ఏడు కొండలు, తిరుపాలు, సంకే శ్రీను, గోపాలం, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోకి పెరుగుతున్న వలసలు

చినగంజాం, మార్చి 16: మండల పరిఽధిలోని పలుగ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయని తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆసోది సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు పొద వీరయ్య అన్నారు. మండలంలోని పల్లెపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దపల్లెపాలెంకు చెందిన 70 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు వీరయ్య తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీలో చేరేందుకు వీరు పలువాహనాల్లో ర్యాలీగా చినగంజాం నుంచి ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద శనివారం టీడీపీ నాయకులు ర్యాలీకి జెండా ఊపారు.

కార్యక్రమంలో చినగంజాం సర్పంచ్‌ రాయని ఆత్మారావు, జనసేన మండల అధ్యక్షుడు సందు శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బత్తుల శ్రీనివాసరావు, అబ్దుల్‌కలాంఅజాద్‌, నక్కల వీరరాఘవులు, సందు శ్రీనివాసరావు, టి.జయరావు, నరహరి శ్రీనివాసరావు, కె.భాస్కరరెడ్డి, వాటుపల్లి ఏడుకొండలు, రాజు ఉదయ భాస్కరరెడ్డి, గంటా వెంకటనారాయణ, శేరు వెంకటేశ్వ ర్లు, నాంచార్యులు, కె.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 11:33 PM