Share News

ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం ఖాయం

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:18 AM

రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం తథ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం ఖాయం

కొనకనమిట్ల, ఏప్రిల్‌ 5 : రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం తథ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రేగుమానిపల్లి పంచాయితీలోని మర్రిపాలెం, గుర్రాలమడుగు గ్రామాలలో శుక్రవారం వైసీపీని వీడి మార్కాపురం ఉమ్మడిపార్టీ అభ్యర్ధి కందుల నారాయణరెడ్డి సమక్షంలో టీడీపీలో 20 కుటుంబాలు చేరాయి. ‘ఇంటింటికి మన కందుల’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా కందుల మా ట్లాడుతూ జరిగే ఎన్నికలలో రానున్నది ఉమ్మడి కూటమి ప్రభుత్వమని రాష్ట్రాభివృద్ధికి కలసికట్టుగా పనిచేస్తామన్నారు. పార్టీలో చేరిన పిన్నబోయిన బాలయ్య, మువ్వబాలు, బువ్వా పిచ్చయ్య, మువ్వా వెంకటసుబ్బయ్య, మువ్వా పెదకాశయ్య, చినకాశయ్య, మువ్వా రాధ, మావ్వా పార్వతమ్మ, మువ్వ తిరుపతయ్య, బోణం కేశవులు, బోణం గోపి, తాతనబోయిన బాలకృష్ణ, కర్ణా చినకొండయ్య తదితర 20 వైసీపి కుటుంబాల వారు జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడిపార్టీ అభ్యర్ధి కందుల సమక్షంలో పార్టీలో చేరినట్లు చేరారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బలహీనవర్గాల పార్టీ టీడీపీ

తర్లుపాడు, ఏప్రిల్‌ 5: బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని యువ నాయకుడు కందుల రోహిత్‌రెడ్డి అన్నారు. తర్లుపాడులోని నాయుడుపల్లె కాలనీ, బీసీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడు తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని అధికా రంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ శాయ శక్తుల కృషి చేయాలని కోరారు. టీడీపీతోనే బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభ్యున్నతికి పాటు పడింద న్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కందుల నారాయణరెడ్డి, ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పి.ఏసు దాసు, మండల అధ్యక్షుడు ఉడు ముల చిన్నపురెడ్డి, పి.గోపినాథ్‌ చౌదరి, టీడీపీ నాయకు లు జి.సుబ్బయ్య, ఈర్ల వెంకటయ్య, కాళంగి శ్రీనివాసులు, ఖైరూ, జి.వెంకటేశ్వర్లు, ఈర్ల పెద్ద కాశయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 01:18 AM