Share News

వలంటీర్లకు టీడీపీ వ్యతిరేకం కాదు

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:41 PM

వలంటీర్లకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, వారు చేసే రాజకీయాలను మాత్రమే టీడీపీ వ్యతిరేకిస్తోందని నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పింఛన్లు పంచేందుకు అవసరమైన డబ్బులు విడుదల చేయకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వలంటీర్లకు టీడీపీ వ్యతిరేకం కాదు
మాట్లాడుతున్న లక్ష్మి, పక్కన పాపారావు

దర్శి, ఏప్రిల్‌ 5 : వలంటీర్లకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, వారు చేసే రాజకీయాలను మాత్రమే టీడీపీ వ్యతిరేకిస్తోందని నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పింఛన్లు పంచేందుకు అవసరమైన డబ్బులు విడుదల చేయకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా రాజకీయ దురుద్దేశంతో టీడీపీపై అభాండాలు వేయాలన్న లక్ష్యంతో పింఛన్‌దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత అన్న ఎన్టీఆర్‌ రూ.35లతో పింఛను పథకాన్ని ప్రవేశ పెట్టగా టీడీపీ అధినేత చంద్రబాబు రూ.2 వేలకు పెంచిన విషయాన్ని వైసీపీ నేతలు మరువొద్దని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక 4 వేల రూపాయల చొప్పున పింఛన్‌ ఇంటికి వెళ్ళి అందించనున్నట్లు తెలిపారు. వైసీపీ చేస్తున్న కుట్రలను కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికలలో వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Updated Date - Apr 05 , 2024 | 11:41 PM