ముస్లింల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట
ABN , Publish Date - Apr 06 , 2024 | 12:19 AM
ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వారికి అభివృద్ధికి కోసం మరింత పెద్దపీట వేస్తామని టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక 4వ డివిజన్లోని మక్కా మసీద్ వద్ద ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల, మాగుంటలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం అన్నారు.
![ముస్లింల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట](https://media.andhrajyothy.com/media/2024/20240326/05_PREM_002_e0de221524.gif)
ఒంగోలు (కార్పొరేషన్), ఏప్రిల్ 5 : ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వారికి అభివృద్ధికి కోసం మరింత పెద్దపీట వేస్తామని టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక 4వ డివిజన్లోని మక్కా మసీద్ వద్ద ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల, మాగుంటలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం అన్నారు. మొదటి నుంచి ముస్లింలసంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి అందరు అండగా ఉండాలని అన్నారు. అదేవిధంగా షాదీఖానా నిర్మాణం, కబరస్తాన్లు, మసీదులు, ఈద్గాల అభివద్ధి తెలుగుదేశం పార్టీలోనే జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర మాజి డైరెక్టర్ షేక్ కపిల్ బాషా, జిల్లా నాయకులు పఠాన్ హనీ్ఫఖాన్, కరిముల్లా, షేక్ కరిముల్లా, అల్లాభక్షు, మహ్మద్ఖాన్, షేక్ అన్వర్, పఠాన్ నాయబ్ రసూల్, షేక్ మౌలాలి, షేక్ మస్తాన్ బాబా, షేక్ కాలేషా, షేక్ ముల్లా, షేక్ సిలార్, ,పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.