Share News

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:43 AM

రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఆపార్టీ బాపట్ల పార్లమెం ట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. గురువారం సాయంత్రం మార్టూరులోని తూర్పుబజా రున ఉన్న వినాయక స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం లో వైసీపీ అరాచక పాలన అంతం కావాలని స్వామి వా రిని ప్రార్ధించినట్టు చెప్పారు. అనంతరం జరిగిన కార్యక్ర మంలో తూర్పుబజారుకు చెందిన వైసీపీకి చెందిన సీని యర్‌ నేత కొనకంచి మురళి తన అనుచరులతో ఏలూరి సమక్షంలో పార్టీలో చేరారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి
ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీ లో చేరిన తూర్పు బజారు, విజయనగర్‌ కాలనీ యువకులు

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పార్టీలో చేరిన యువకులు

మార్టూరు, మార్చి 28: రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఆపార్టీ బాపట్ల పార్లమెం ట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. గురువారం సాయంత్రం మార్టూరులోని తూర్పుబజా రున ఉన్న వినాయక స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం లో వైసీపీ అరాచక పాలన అంతం కావాలని స్వామి వా రిని ప్రార్ధించినట్టు చెప్పారు. అనంతరం జరిగిన కార్యక్ర మంలో తూర్పుబజారుకు చెందిన వైసీపీకి చెందిన సీని యర్‌ నేత కొనకంచి మురళి తన అనుచరులతో ఏలూరి సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికి ఏలూరి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. పార్టీలో చేరినవారిలో రొంపిచర్ల గోపు వెంకట్రావు, సత్తెనపల్లి పరశురాం, తాని కొండ గంగయ్య, కొల్లా బ్రహ్మం, తొండెపు శ్రీను, కొనకం చి సాంబయ్య , పొట్రు శ్రీను ఉన్నారు. అలాగే, విజయన గర్‌ కాలనీకి చెందిన కొమెర వెంకట్రావు, కొమ్మెర అం కమ్మ రావు, కొమ్మెర ప్రభాస్‌ పార్టీలో చేరారు. కార్యక్ర మంలో కమ్మ శివనాగేశ్వరరావు, తాటి నాగేశ్వరరావు, తొండెపు ఆదినారాయణ, కాకోలు వెంకటేశ్వర్లు, తొట్టెం పూడి భుజంగరావు, జంపని సాంబశివరావు, శానంపూడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

పర్చూరులో తెలుగుతమ్ముళ్ల ప్రచారం

పర్చూరు, మార్చి 28: పర్చూరులో తెలుగుదేశం పార్టీ గురువారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పర్చూ రు గ్రామ దేవత శ్రీఅద్దంకి నాంచారమ్మ అమ్మవారి దే వస్థానంలో పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంత రం పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ప్రారంభించారు. తొలిరోజే పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ శ్రేణులు తరలిరావటంతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇంటింట తిరిగి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమా లను వివరిస్తూ, తెలుగుదేశం పార్టీని అధికా రంలోకి తీసుకు రావాలని కోరు తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ షం షుద్దీన్‌, పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, కొల్లా శివరాంప్రసాద్‌, కొండ్రగంటి సుబ్బారావు, మామిడిపాక హరిప్రసాద్‌, తంగెళ్ళ మల్లిఖార్జునరావు, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, ఆకుల మధుబాబు, దూళిపల్లి వెంకటస్వామి, గడ్డిపాటి శ్రీనివాసరావు, బత్తుల సాంబశివరావు, మక్కెన శేఖర్‌బాబు, లక్కిపోగు సుమన్‌, చెరుకూరి శ్రీధర్‌ (చింపయ్య), శ్రీరాం వెంకటసుబ్బారావు, ఊటుకూరి నిర్మ ల, తులసి కోటేశ్వరమ్మ, కొల్లా సుబ్బాయమ్మ, శివాలశెట్టి రమాదేవి, పఠాన్‌ బాజీ, షేక్‌ బషీర్‌, కట్టెంపూడి జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

అరాచక పాలనకు చరమగీతం పాడాలి

పర్చూరు, మార్చి 28: అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. గురువారం క్యాంపు కా ర్యాలయంలో కారంచేడు నేతలతో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు. నాయకులంతా కలసికట్టుగా పార్టీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి అప్పులపాలు చేశారని అన్నారు. టీ డీపీ, బీజేపీ, జనసేన చేతులు కలిపింది వ్యక్తిగత ప్రయో జనాలకోసం కాదని, రాష్ట్ర భవిష్యత్‌ కోసం మాత్రమే నన్నారు. దివాళా తీసిన రాష్ట్రానికి జవసత్వాలు అందిం చాలనే లక్ష్యంతో మూడు పార్టీలు జత కట్టాయని వివ రించారు. ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే ఏలూరి పార్టీ కండువాలు కప్పి సా దరంగా ఆహ్వానించారు.

Updated Date - Mar 29 , 2024 | 12:43 AM