Share News

ఆధ్యాత్మికం..ఆత్మీయత

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:06 AM

: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆత్మీయ కా ర్యక్రమాల్లో పాల్గొని, స్థానికులు, భక్తులతో ఆత్మీయంగా మాట్లాడారు. మండల పరిధిలోని బోయినవారిపాలెంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ ప్రత్యేక పూజల్లో కొండయ్య పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం..ఆత్మీయత

చీరాల, ఏప్రిల్‌ 17 : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆత్మీయ కా ర్యక్రమాల్లో పాల్గొని, స్థానికులు, భక్తులతో ఆత్మీయంగా మాట్లాడారు. మండల పరిధిలోని బోయినవారిపాలెంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ ప్రత్యేక పూజల్లో కొండయ్య పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ మా కొండయ్య అం టూ పక్కవారికి పరిచయం చేశారు. అ నంతరం కావూరివారిపాలెంలో బ్రహ్మంగారి గుడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:06 AM