టీడీపీకి మద్దతిచ్చారని దుకాణాలు ఖాళీ
ABN , Publish Date - May 30 , 2024 | 12:04 AM
ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్లో టీడీపీకి మద్దతు పలికిన వ్యాపారులను ఆయా షాపులు ఖాళీ చేయించాలని ఒత్తిడి చేయటంతో వారు ఖాళీచేసివెళ్లిన ఘటనలు తూర్పుగంగవరం గ్రామంలో చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన వ్యాపారులు ఈపర్యాయం టీడీపీకిమద్దతు ప్రకటించారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు తమ షాపులను ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు
![టీడీపీకి మద్దతిచ్చారని దుకాణాలు ఖాళీ](https://media.andhrajyothy.com/media/2024/20240511/29tallur6_73965763fa.gif)
తాళ్లూరు, మే 29 : ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్లో టీడీపీకి మద్దతు పలికిన వ్యాపారులను ఆయా షాపులు ఖాళీ చేయించాలని ఒత్తిడి చేయటంతో వారు ఖాళీచేసివెళ్లిన ఘటనలు తూర్పుగంగవరం గ్రామంలో చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన వ్యాపారులు ఈపర్యాయం టీడీపీకిమద్దతు ప్రకటించారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు తమ షాపులను ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. వైసీపీ శ్రేణులకు చెందిన షాపులను అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేస్తూ టీడీపీ మద్దతు పలికిన వ్యాపారులపై ఖాళీచేయమని తీవ్ర ఒత్తిళ్లు చేశారు. దీంతో జనసేన నేత, భోజనహోటల్ నిర్వాహకులు తోటకృష్ణ, షామియానా షాపు రఫీ,మరి కొందరిని వైసీపీ శ్రేణులు తమషాపుల నుంచి ఖాళీ చేయించినట్లు తెలిసింది. ఎన్నికల్లో తమకు మద్దతు పలకలేదన్న కారణంతో వారి షాపులు ఖాళీ చేయించటంపై సర్వత్రావిమర్శలు వినవస్తున్నాయి.