అంబడిపూడిలో వైసీపీకి షాక్
ABN , Publish Date - Apr 15 , 2024 | 11:19 PM
మండలంలోని అంబడిపూడి గ్రామానికి చెందిన సర్పంచ్ మైలా కుసుమకుమారి తన వర్గీయులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అంబడిపూడి గ్రామానికి చెందిన మద్దుమాల రాజమోహన్, కోటేశ్వరరావు, వేణుబాబు, ఎర్రిబోయిన ప్రసాద్, గంగవరపు వాసుబాబు, మక్కెన పుల్లారావు, బండారు వెంకటేశ్వర్లు, గుదే వసంతరావు, కొరివి రాజీవ్గాంధీ, నేలటూరి జయరావు తదితరులు పేటలోని ఎమ్మెల్యే రవికుమార్ ఇంటికి వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వర్గీయులతో గొట్టిపాటి సమక్షంలో టీడీపీలో చేరిన సర్పంచ్
బల్లికురవ, ఏప్రిల్ 15 : మండలంలోని అంబడిపూడి గ్రామానికి చెందిన సర్పంచ్ మైలా కుసుమకుమారి తన వర్గీయులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అంబడిపూడి గ్రామానికి చెందిన మద్దుమాల రాజమోహన్, కోటేశ్వరరావు, వేణుబాబు, ఎర్రిబోయిన ప్రసాద్, గంగవరపు వాసుబాబు, మక్కెన పుల్లారావు, బండారు వెంకటేశ్వర్లు, గుదే వసంతరావు, కొరివి రాజీవ్గాంధీ, నేలటూరి జయరావు తదితరులు పేటలోని ఎమ్మెల్యే రవికుమార్ ఇంటికి వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ సర్పంచ్, వర్గీయులు పెద్ద ఎత్తున టీడీపీలోకి రావడంతో వైసీపీకి షాక్ తగిలింది. వారందిరికీ కండువాలు వేసి స్వాగతించిన గొట్టిపాటి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ నేతలు మందలపు సుధాకర్, ద ద్దాల అంజయ్య, కోటేశ్వరరావు పా ల్గొన్నారు. మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన వనం అంజనేయులు, గుర్రాల అనిల్, మరో పది కుటుంబాలు గొట్టిపాటి సమక్షంలో సైకిలెక్కారు.
గొట్టిపాటిని గెలిపించండి - బాబీ ఇంటింటి ప్రచారం
బల్లికురవ : రెండు దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని యువనేత గొట్టిపాటి కమల్కిషోర్ (బాబీ) కోరారు. సోమవారం మండలంలోని సూరేపల్లి గ్రామంలో బాబీ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన కృష్ణప్రసాద్, రవికుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క చాన్స్తో రాష్ట్రాన్ని గుల్ల చేసిన జగన్రెడ్డిని, వైసీపీని ఇంటికి పంపాలన్నారు. ఇన్నాళ్లూ బటన్ నొక్కి మోసగించిన వైసీపీ పాలకులను వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కి బుద్ధి చెప్పాలని బాబీ పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం, పిల్లల భవిష్యత్ కోసం కూటమికి ప్ర జలంతా ఏకపక్షంగా మద్దతు పలకాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొం డేటి ఇజ్రాయల్, సింగరకొండ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.