Share News

పేద ప్రజలే టీడీపీకి అండ

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:34 AM

పేద ప్రజలే టీడీపీకి అండదండ అని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక మల్లారెడ్డి కాలనీలో టీడీపీ ఆధ్వర్యంలో కాలనీవాసులతో సోమవారం రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

పేద ప్రజలే టీడీపీకి అండ

మార్కాపురం వన్‌టౌన్‌, ఫిబ్రవరి 26: పేద ప్రజలే టీడీపీకి అండదండ అని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక మల్లారెడ్డి కాలనీలో టీడీపీ ఆధ్వర్యంలో కాలనీవాసులతో సోమవారం రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ కందుల మల్లారెడ్డి కాలనీ స్థలాలు తమ కుటుంబ సొంత స్థలాలని వాటిని పేదలకు కేటాయించామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడ మే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి, కందుల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

బేస్తవారపేట : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని బేస్తవారపేట మాజీ సర్పంచ్‌ గాజుల విఽశ్వనాథం అన్నారు. బాబుష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బేస్తవారపేటలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు కలసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ, జనసేనా ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను మహిళలకు, ప్రజలకు వివరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి ద్వారా మహిళలకు ఏటా రూ.18వేలు అందించనున్నారన్నారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా పంచాయతీ నిధులు కూడా స్వాహా చేసిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదే అన్నారు. నాడు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని వివరించారు. కార్యక్రమంలో గాజుల విశ్వనాథం దూదెకుల సైదులు, ముప్పూరి రాము, దూదెకుల ఆదాం, సందు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : టీడీపీ యాప్‌ను అందరూ వినియోగిం చుకోవాలని ఆ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో బేస్తవార పేట మండలం గలిజేరుగుళ్ల పంచాయతీలోని చెన్నుపల్లె గ్రామానికి చెందిన ఈర్నేని గోపాల్‌ చురుగ్గా వినియోగిస్తున్నందున పార్టీ అధిష్ఠానం నుంచి అభినందనలు అందుకున్నాడు. ఈ సందర్భంగా అధిష్ఠానం టేబుల్‌ స్టాండ్‌ సైకిల్‌ సింబల్‌ను పంపించింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తు ముల అశోక్‌రెడ్డి గోపాల్‌కు అందచేసి అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దప్పిలి విజయ భాస్కర్‌రెడ్డి, గుంటక చిన్నకొండయ్య, దుత్తా బాలీశ్వర య్య, బోదనపోయిన గోపాలక్రిష్ణ, పాల్గొన్నారు.

తర్లుపాడు : రానున్న ఎన్నికల్లో వైసీపీకి నూకలు చెల్లుతాయని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కుమారులు రోహిత్‌రెడ్డి, విగ్నేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీ లోని ఓబాయపల్లెలో ‘బాబుష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన ప్రభు త్వం రావడం తథ్యమన్నారు. మార్కాపురం నియోజక వర్గంలో తండ్రి నారాయణరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షు లు ఉడుముల చిన్నపురెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యాక్షులు కంచెర్ల కాశయ్య, టీడీపీ నాయకులు పి.గోపినాథ్‌ చౌదరి, నంబుల లక్ష్మయ్య, కొండారెడ్డి, అచ్చిరెడ్డి, నాలి బాలయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:34 AM