Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN , Publish Date - May 22 , 2024 | 10:41 PM

ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ను మినీ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం పట్టణ సమీపంలోని పామూరు హైవే రోడ్డుపై డిగ్రీ కళాశాల వద్ద చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రోడ్డు ప్రమాద ఘటనలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు

కనిగిరి సమీపంలో డీసీఎం వ్యాన్‌, మినీ లారీ ఢీ

ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలు

కనిగిరి, మే 22 : ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ను మినీ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం పట్టణ సమీపంలోని పామూరు హైవే రోడ్డుపై డిగ్రీ కళాశాల వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని మాచవరం గ్రామానికి చెందిన రోజువారీ భవన నిర్మాణ కార్మికులు 15 మంది స్లాబ్‌ వేసేందుకు సామగ్రితో డీసీఎం వ్యాన్‌లో కనిగిరి వెళ్తున్నారు. అదేవిధంగా విజయవాడ నుంచి కనిగిరి మీదుగా కడప వైపు వెళ్తున్న మినీ లారీ వస్తుంది. ఈ క్రమంలో మినీ లారీ డ్రైవర్‌ కునుకు తీయటంతో రోడ్డుకు మరో వైపు ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ వెనుకు భాగాన్ని ఢీకొట్టింది. దీంతో వ్యాను వెనుక చక్రాలు ఊడి స్లాబ్‌ సామగ్రితో సహా తిరగబడింది. దీంతో అవన్నీ పైన పడడంతో ఉప్పు రమాదేవి(51) తీవ్ర గాయాలపాలైంది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందింది. అదేవిధంగా మాచవరం గ్రామానిక చెందిన సుశీలకు, మినీ లారీ డ్రైవర్‌ సురే్‌షకు గాయాలయ్యాయి. వీరిరువురు స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - May 22 , 2024 | 10:41 PM