Share News

తొమ్మిది ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు

ABN , Publish Date - May 19 , 2024 | 01:15 AM

జిల్లాలో గర్భిణులకు అత్యధికంగా ఆపరేష న్లు చేసిన తొమ్మిది ప్రైవేటు వైద్యశాలలకు వైద్యారోగ్యశాఖ అధికారులు నోటీ సులు జారీచేశారు.

తొమ్మిది ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు

గర్భిణులకు ఎక్కువగా సిజేరియన్లు చేయడమే కారణం

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 18: జిల్లాలో గర్భిణులకు అత్యధికంగా ఆపరేష న్లు చేసిన తొమ్మిది ప్రైవేటు వైద్యశాలలకు వైద్యారోగ్యశాఖ అధికారులు నోటీ సులు జారీచేశారు. గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేటు వైద్యశాలల్లో చేరుతు న్నారు. అయితే వందకు 80శాతం మంది మహిళలకు సిజేరియన్‌ (ఆపరేష న్లు) చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒంగోలులో ఆరు, మార్కాపురంలో రెండు, గిద్దలూరులోని ఒక ఆస్పత్రిలో ఎక్కువ సిజేరియన్‌లు చేసినట్లు తేలింది. సాధారణ కాన్పునకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాతనే అవసరమైతే సిజేరియన్‌ చేయాల్సి ఉంది. కానీ ఆయా ప్రైవేటు హాస్పిటల్స్‌లో చేరిన గర్భిణులందరికీ ఆపరేషన్లు చేసినట్లుగా నిర్ధారించి ఈ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఆయా ఆస్పత్రుల నుంచి వివరణ తీసుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - May 19 , 2024 | 08:32 AM