కొండయ్య తరపున నామినేషన్ దాఖలు
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:46 PM
టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య తరపున ఆయన కుమారుడు గౌరీఅమర్నాఽథ్ (ప్రపోజర్) తదితరులు శుక్రవారం ఆర్వో సూర్యనారాయణరెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఆర్వోకు అందజేసిన కుమారుడు గౌరీ అమర్నాథ్
ముగ్గురి నామినేషన్ల స్వీకరణ
చీరాల, ఏప్రిల్ 19 : టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య తరపున ఆయన కుమారుడు గౌరీఅమర్నాఽథ్ (ప్రపోజర్) తదితరులు శుక్రవారం ఆర్వో సూర్యనారాయణరెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున అంకమ్మగాంధీ లగడపాటి, స్వంతంత్ర అభ్యర్థి పింజల శాంతారాం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ముగ్గురు అభ్యర్థుల తరపున నాలుగు సెట్ల నామినేషన్లును ఆర్వో స్వీకరించారు.
పర్చూరులో నలుగురు
పర్చూరు : పర్చూరులో రెండో రోజు శుక్రవారం మొత్తం నలగులు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యడం బాలాజీ నామినేషన్ వేశారు. పిరమిడ్ పార్టీ తరుపున బెండపూడి లోకేశ్వరశర్మ, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ ఖాశిం సైదా, జాతీయ సమసమాజ పార్టీ అభ్యర్థిగా బాచిన రాంబాబు నామప త్రాలను దాఖలు చేసినట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంధం రవీందర్ తెలిపారు.