పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరిక
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:03 PM
సీఎ్సపురం సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బోయిళ్ల నారాయణరెడ్డి అనుచరులు పామూరుకు చెందిన పలువురు కాపు సంఘం నాయకులు, మాజీ వార్డు మెంబర్ వరికూటి చిరంజీవి, హనుమంతరావు ఆధ్వర్యంలో 56 కాపు కుటుంబాలు వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు.
![పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరిక](https://media.andhrajyothy.com/media/2024/20240326/3pmr1_1bcab0e648.gif)
పామూరు నుంచి బోయిళ్ల అనుచరులు
వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఇన్చార్జి ఉగ్రనరసింహారెడ్డి
పామూరు, ఏప్రిల్ 3 : సీఎ్సపురం సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బోయిళ్ల నారాయణరెడ్డి అనుచరులు పామూరుకు చెందిన పలువురు కాపు సంఘం నాయకులు, మాజీ వార్డు మెంబర్ వరికూటి చిరంజీవి, హనుమంతరావు ఆధ్వర్యంలో 56 కాపు కుటుంబాలు వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. కనిగిరిలోని అమరావతి గ్రౌండ్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉగ్ర వారందరికీ పార్టీ కండువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తన ముందు ఉన్న ఏకైక లక్ష్యమన్నారు. పార్టీలో చేరిన వారిలో మద్దిశెట్టి వెంకటస్వామి, రామిశెట్టి రమణయ్య, చిత్తూరి మురళి, ఇండ్ల నరసింహారావు, నల్లబోతుల చెన్నయ్య, కందికట్టె హజరత్తు, చిత్తూరి నారాయణ, గుత్తి సురేష్, కొండయ్య, బార్గం వెంకటేశ్వర్లు, పూల మాధవ, పిక్కిలి మనోహార్, రత్నం, రాంబాబులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు భైరెడ్డి జయరామిరెడ్డి, బోయిళ్ల నారాయణరెడ్డి, డీవీ మనోహర్, కావిటి సుబ్బయ్య, షేక్ ఖాజారహంతుల్లా, బద్దిపూడి మార్కు, ఉప్పలపాటి హరిబాబు, పందిటి హరీష్, ఎన్ సాంబయ్య, ముబీనామౌలాలి, తోట రవికుమార్, బీ సత్యం, కొండా నరసింహులు, మెంటా నరసింహారావు పాల్గొన్నారు. ఆ మండలంలోని నుచ్చుపొద పంచాయతీ తిరగళదిన్నె గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒంటేరు నాగారాజు, నాగేంద్ర, నవీన్లు వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలతో ఉగ్ర స్వాగతం పలికారు. నేతలు పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, సయ్యద్ అమీర్బాబు, ఆరేకొండా హరిప్రసాద్, కౌలూరి ఖాజారహంతుల్లా, కౌలూరి హనీఫ్, ఆవుల రమణమ్మ, గోసుల సురేంద్ర, కామేపల్లి సూర్య పాల్గొన్నారు.
17 ఎస్సీ కుటుంబాలు టీడీపీలో చేరిక
వెలిగండ్ల, ఏప్రిల్ 3 : మండలంలోని పద్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన 17 కుటుంబాల వారు కనిగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చెరిన వారిలో అట్లూరి రామయ్య, గూడూరి చిన్యయ్య, ఇత్తడి పెదమాలకొండయ్య, గూడూరి ఎలియా, అంబటి మరియదాసు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు ముత్తిరెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, గవదకట్ల పెద మాలకొండయ్య, చిలకల వెంకటేశ్వర్లు, కర్నాటి భాస్కర్రెడ్డి, సాన జయపాల్రెడ్డి, అక్కి శ్రీను, అక్కి రాజేంద్ర, మహేష్, చంద్ర, వరయ్య తదితరులు పాల్గొన్నారు.