Share News

ఒంగోలు డీఎస్పీగా కిషోర్‌బాబు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Feb 04 , 2024 | 01:09 AM

ఒంగోలు డీఎస్పీగా ఎం.కిషోర్‌బాబు శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

ఒంగోలు డీఎస్పీగా కిషోర్‌బాబు బాధ్యతల స్వీకరణ

నారాయణస్వామిరెడ్డి భీమవరం బదిలీ

ఒంగోలు(క్రైం), ఫిబ్రవరి 3 : ఒంగోలు డీఎస్పీగా ఎం.కిషోర్‌బాబు శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేసిన కె.నారాయణస్వామిరెడ్డి బదిలీపై భీమవరం వెళ్లారు. ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న కిషోర్‌బాబును పోలీసు సిబ్బంది కలిసి బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కిషోర్‌బాబు ఇప్పటివరకూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేశారు.

Updated Date - Feb 04 , 2024 | 01:10 AM