అద్దంకి ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:34 PM
అద్దంకి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఇచ్చిన ప్రతిమాటా నిలబెట్టుకుంటానని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
వచ్చేది కూటమి ప్రభుత్వం
దుష్ట పాలన అంతమై..ధర్మ పాలన వస్తుంది
మీడియాతో గొట్టిపాటి
అద్దంకిటౌన్, ఏప్రిల్ 19 : అద్దంకి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఇచ్చిన ప్రతిమాటా నిలబెట్టుకుంటానని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నాలుగు సార్లు పోటీ చేయగా, ఎమ్మెల్యేగా అద్దంకి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఐదోసారి నామినేషన్ వేశానని, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అసెంబ్లీకి వెళ్తానన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, మోదీల నాయకత్వంలో కచ్చితంగా రాబోయే రోజులలో ఆంధ్రరాష్ట్రంలో 175కు 160 సీట్లు గెలవబోతున్నామని గొట్టిపాటి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కూటమికి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని, జగన్ దుష్ట పాలనను అంతమై.. ధర్మపాలన వస్తుందన్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజ యవంతం చేసిన కూటమి శ్రేణులు, అద్దంకి ప్రజలకు గొట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు.