Share News

ఎరిక్షన్‌బాబు ఎంపికపై హర్షం

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:37 AM

ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్‌బాబును రాష్ట్రటీడీపీ అధిష్ఠానం శనివారం ప్రకటించింది.

ఎరిక్షన్‌బాబు ఎంపికపై హర్షం

ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి 24 : ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్‌బాబును రాష్ట్రటీడీపీ అధిష్ఠానం శనివారం ప్రకటించింది. దీంతో ఎర్రగొండపాలెంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసు కున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబుకు అభినందనలు తెలిపారు. దుశ్శాలవాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఎరిక్షన్‌బాబును అత్యధిక మెజార్టితో గెలిపించి, ఎర్రగొండపాలెం సీటును చంద్రబాబునాయుడికి కానుకగా ఇస్తామని నినాదాలు చేశారు. ఐదు మండలాల టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.

ఎన్టీఆర్‌ కూడలిలో బాణసంచా కాల్చిసంబరాలు

రాష్ట్ర అధినేత చంద్రబాబునాయుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్‌బాబు ను శనివారం 11 గంటల సమయంలో ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచాపేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

నాయకులు, కార్యకర్తల సహకారంతోనే..

ఎర్రగొండపాలెం : నాయకులు, కార్యకర్తలు తన వెంట నడిచి సహకారం అందించడంతోనే తనకు టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల తొలిజాబితాలో సీటు దక్కిందని, టీడీపీ ఇన్‌చార్జ్‌ ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబునాయుడికి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటానని, ఎర్రగొండపాలెం సీటు గెలిచి పార్టీకి కానుకగా ఇస్తానని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో పర్యటించానని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు పడుతున్న సాదక బాధలు దగ్గరుండి చూసినట్లు తెలిపారు. వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తెలుసుకున్నానన్నారు. సాగునీరు,తాగునీరు సమస్యనుతీర్చే ప్రధానవనరు వెలిగొండప్రాజెక్టు పూర్తి చేయించేందుకు టీడీపీ అభ్యర్థిగా గెలిచి తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు. గ్రామాల్లో నెలకొన్న డ్రైనేజి, రోడ్ల సమస్యలు పరిష్కారం చూపుతానని అన్నారు. నియోజకవర్గ ఓటర్లు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తన విజయానికి దోహదపడాలన్నారు. రాష్ట్రంలో టీడీపీకి పట్టంకట్టి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు నిశ్చయించుకు న్నారన్నారు. చంద్రబాబునాయుడి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటు ఉండి నియోజకవర్గంను అభివృద్ది చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో ద్వితీయశ్రేణినాయకులు పాల్గొన్నారు.

దోర్నాల నేతల్లో నూతనోత్సాహం

పెద్ద దోర్నాల : ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా గూడూరి ఎరిక్షన్‌ బాబును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించడంతో మండల నాయకుల్లో నూతనోత్సహం వచ్చింది. టపాసులు పేలుస్తూ ఎరిక్షన్‌బాబు నాయకత్యం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా గూడూరిని పార్టీ నియమించినప్పటి నుంచి గ్రామాలలో పదే పదే పర్యటిస్తూ అందరిని ఆకట్టుకున్నారనే స్థాయికి చేరుకున్నారు. టీడీపీ టిక్కెట్‌ను ఆశిస్తున్న వారు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఉండడంతో కొంతకాలంలో అభ్యర్థి ఎంపికపై కొంత సందిగ్ధత నెలకొంది. అయితే పార్టీ అధిష్ఠానం తొలి నుంచి ఎరిక్షన్‌బాబు వైపే ఉంది. ఇదే క్రమంలో ఆయనకు పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే చోటు లభించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఏర్వ మల్లికార్జున రెడ్డి, నాయకులు దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, ఇస్మాయిల్‌, షేక్‌ భాష, చల్లా వెంకటేశ్వర్లు, ఎలకపాటి చెంచయ్య, కే.శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, రావిక్రింది సుబ్బరత్నం, నాగెళ్ల సత్యనారాయణ,షేక్‌ మంజూర్‌ భాష, రషీ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:37 AM