Share News

దివ్యాంగుడికి బైకును అందజేసిన గొట్టిపాటి

ABN , Publish Date - May 20 , 2024 | 10:30 PM

మండలంలోని వల్లాపల్లి ముస్లింకాలనీకి చెందిన పూర్తి వైకల్యంతో బాధపడుతున్న దివ్వాంగుడు షేక్‌ జాన్‌బాషాకు ఎ మ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ మూడుచక్రాల బైకును సోమవారం గ్రామ టీడీపీ నేతల ద్వారా అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో వల్లాపల్లి ముస్లిం కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్‌కు దివ్వాండుగు జాన్‌బాషా కలిశారు. అయనను చూసిన ఎమ్మెల్యే బైకు ఇస్తానని, ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

దివ్యాంగుడికి బైకును అందజేసిన గొట్టిపాటి
బైకును అందజేస్తున్న టీడీపీ నాయకులు

బల్లికురవ, మే 20 : మండలంలోని వల్లాపల్లి ముస్లింకాలనీకి చెందిన పూర్తి వైకల్యంతో బాధపడుతున్న దివ్వాంగుడు షేక్‌ జాన్‌బాషాకు ఎ మ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ మూడుచక్రాల బైకును సోమవారం గ్రామ టీడీపీ నేతల ద్వారా అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో వల్లాపల్లి ముస్లిం కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్‌కు దివ్వాండుగు జాన్‌బాషా కలిశారు. అయనను చూసిన ఎమ్మెల్యే బైకు ఇస్తానని, ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో, ఎన్నికలు ముగిశాక ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు టీడీపీ గ్రామ నేతల ద్వారా బైకును జాన్‌బాషాకు అందజేశారు. టీడీపీ నేత చింతల అమరనాథ్‌ బైకుకు ఇన్సూరెన్స్‌, ట్యాక్స్‌ను కట్టి కొంత సహకారం అందజేశారు. కార్యక్రమంలో నేతలు పరుసు ప్రసాద్‌, పత్తిపాటి వెంకట్రావు, షేక్‌ అల్లాఉద్దీన్‌, మందా వీరాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 10:30 PM