Share News

కూటమితోనే మంచి పాలన

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:39 PM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి పాలన అందుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గురువారం రాత్రి అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, శింగరకొండలో గొట్టిపాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

కూటమితోనే మంచి పాలన
గొట్టిపాటికి హారతులిస్తున్న మహిళలు

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి

అద్దంకిటౌన్‌, ఏప్రిల్‌ 18 : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి పాలన అందుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గురువారం రాత్రి అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, శింగరకొండలో గొట్టిపాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చంద్ర బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసే పథకాలను, వాటి ప్రయో జనాలను గొట్టిపాటి వివరించారు. ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచేశారన్నారు. దో పిడీ, దౌర్జన్యం, అరాచక పాలన సాగిం చేవారికి మరో చాన్స్‌ ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్‌ కోసం సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి కూటమి అభ్య ర్థులను గెలిపించాలని గొట్టి పాటి పిలుపునిచ్చారు. టీడీపీ రాగానే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామ న్నారు. పైగా రూ.4వేలకు పింఛన్‌ పెంచినట్లు తెలి పారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామన్నారు. చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్ధరిస్తామన్నారు. టీడీపీ, వైసీపీ పాలనలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించా లన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌ను సైకిల్‌ గుర్తుపై ఒటు వేసి గెలిపించాలని ఓటర్లును కోరారు. కార్యక్రమం లో ఆయా గ్రామాల టీడీపీ నాయకులతో పాటు, మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సం ఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:40 PM