Share News

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసిచూపిస్తా!

ABN , Publish Date - May 03 , 2024 | 12:00 AM

ప్రజల మనస్సు ల్లో చోటు సంపాదించుకున్న గొట్టిపా టి రాజకీయ కుటుంబం వారసురాలి గా మీముందుకు వచ్చా.. ఎన్నికల్లో ఓటుహక్కు ద్వారా ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గంలో అభి వృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా నని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని ఇండ్లచెరువు, రాగమ క్కపల్లి, భూమనపల్లి, రుద్రసము ద్రం, రామాపురం, లక్ష్మీపురం, పోలేపల్లి గ్రామాల్లో ము మ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసిచూపిస్తా!
ఇండ్లచెరువులో గజమాలతో గొట్టిపాటి లక్ష్మిని సన్మానిస్తున్న గ్రామస్థులు

టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దొనకొండ, మే 2: ప్రజల మనస్సు ల్లో చోటు సంపాదించుకున్న గొట్టిపా టి రాజకీయ కుటుంబం వారసురాలి గా మీముందుకు వచ్చా.. ఎన్నికల్లో ఓటుహక్కు ద్వారా ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గంలో అభి వృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా నని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని ఇండ్లచెరువు, రాగమ క్కపల్లి, భూమనపల్లి, రుద్రసము ద్రం, రామాపురం, లక్ష్మీపురం, పోలేపల్లి గ్రామాల్లో ము మ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసంద ర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో మహిళ లు తమపట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిదని అ న్నారు. మహిళా శక్తి అండగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించా లని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దర్శి నియోజకవర్గంను పట్టిపీడిస్తున్న మంచినీ టి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామ న్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి, ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తామన్నా రు. వైద్యపరంగా ప్రజలు ఇబ్బం దులు పడకుండా అన్నీసౌకర్యాలతో వైద్య సేవలందిస్తా మని హా మీ ఇచ్చారు. టీడీపీ అధి నేత చంద్రబాబు ప్రక టించిన సూపర్‌సిక్స్‌ పథ కాలను, ఎన్నికల మేనిఫె స్టోను ప్రజలకు వివరిం చారు. కార్యక్రమంలో టీ డీపీ నియోజకవర్గ మా జీ ఇన్‌చార్జ్‌ పమిడి రమే ష్‌, పార్టీ మండల అధ్య క్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, మోడి వెంకటేశ్వర్లు, వీరపనేని వెంకన్నచౌదరి, కందుల నారపురెడ్డి, వల్లపునేని వెంకట స్వామి, కామేపల్లి నారాయణమ్మ, వడ్ల మూడి చెన్నయ్య, తదితరులు పాల్గొ న్నారు.

హెలీప్యాడ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన

దర్శి, మే2: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈనెల 4న దర్శికి వస్తుండటంతో టీడీపీ నాయకులు ఏర్పాట్లుచేస్తున్నారు. దర్శి అసెంబ్లీ కూటమి అభ్యర్ధి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్‌ లలిత్‌సాగర్‌, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు దర్శి - పొదిలి రోడ్డులో ఓవెంచర్‌లో స్థలాన్ని పరిశీలించారు. ఆస్థలం అనువుగా ఉండటంతో ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. చంద్రబాబు శనివారం ఉదయం 10 గంటలకు దర్శిలో ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ఈనేపథ్యంలో దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, దారం సుబ్బారావు, మారెళ్ల వెంకటేశ్వర్లు, పుల్లలచెరువు చిన్న, కలవకొలను చంద్రశేఖర్‌, కన్నా శ్రీనివాసరావు, తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:00 AM