విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:57 AM
పొలంలో టమాటాలు కోస్తూ విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మిట్టపాలెంలో శనివారం చోటుచేసుకొంది.
![విద్యుదాఘాతంతో రైతు మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పొలంలో టమాటాలు కోస్తుండగా ప్రమాదం
త్రిపురాంతకం, జనవరి 27 : పొలంలో టమాటాలు కోస్తూ విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మిట్టపాలెంలో శనివారం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రైతు నక్కా చిన్నమల్లారెడ్డి (65)కు నాలుగెకరాల పొలం ఉంది. అందులో రెండెకరాల్లో కంది, ఒక ఎకరం మిర్చి, మరో ఎకరంలో టమాటా సాగు చేశాడు. టమాటా పొలంలో ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. వాటి పక్కనే చిన్నమల్లారెడ్డి టమాటాలను కోస్తూ స్తంభానికి ఉన్న సపోర్ట్ తీగలకు తగిలాడు. వాటికి అప్పటికే కరెంటు సరఫరా అయి ఉండటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పక్క పొలం రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువుల సహాయంతో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడు చిన్నమల్లారెడ్డికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.