ఈసీ ఆంక్షలను గౌరవించాలి!
ABN , Publish Date - Jun 02 , 2024 | 10:33 PM
ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనున్న సంద ర్భంగా ఈసీ విధించిన ఆంక్షలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణు లు గౌరవిం చాలని మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి పేర్కొన్నారు.
![ఈసీ ఆంక్షలను గౌరవించాలి!](https://media.andhrajyothy.com/media/2024/20240530/2_da7849376d.gif)
టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర
కనిగిరి, జూన్ 2: ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనున్న సంద ర్భంగా ఈసీ విధించిన ఆంక్షలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణు లు గౌరవిం చాలని మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నిక లు ఒక భాగం మాత్రమేనని, ప్రతిఒక్కరూ ప్రభుత్వాధి కారులకు సహకరించాలని కోరారు.
ఎన్నికల ఆంక్ష లలో భాగంగా కనిగిరి ప్రాంతంలో విధించిన 144వ సెక్షన్, 30పోలీస్ యా క్టును గౌరవించి పోలీసులకు పూర్తిగా సహకరించాలన్నారు. టీడీపీ కార్యక ర్తలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారని పోలీసుశాఖ గుర్తించేలా నడుచుకోవాలని డాక్టర్ ఉగ్ర ఆకాంక్షించారు.
మార్కాపురంలో డాక్టర్ ఉగ్ర ప్రత్యేక పూజలు
మార్కాపురంలో హజరత్ఖాసీం స్వాములు దర్గాలో డాక్టర్ ఉగ్ర ఆదివా రం ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలో దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశా రు. రాష్ట్రానికి సంక్షేమ పాలన అందించే టీడీపీ అఖండ మెజార్టీతో సీట్లు సాధించి, చంద్రబాబు సీఎం కావాలని ప్రార్థించారు. ప్రార్థనలు చేసినవారి లో టీడీపీ కూటమి అభ్యర్థులు దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్రెడ్డి, ఎరిక్షన్బాబు, తదితరులు ఉన్నారు.