మాయమాటలు నమ్మవద్దు
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:39 AM
నిరంతరం మాయమాటలు, మోసపూరిత చర్యలు చేస్తున్న జగన్రెడ్డి మాటలను నమ్మవద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
![మాయమాటలు నమ్మవద్దు](https://media.andhrajyothy.com/media/2024/20240215/16_GDLTOWN_01_0763a238a2.gif)
గిద్దలూరు టౌన్, ఏప్రిల్ 16 : నిరంతరం మాయమాటలు, మోసపూరిత చర్యలు చేస్తున్న జగన్రెడ్డి మాటలను నమ్మవద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. శుక్రవారం గిద్దలూరు మండలం వెంగల రెడ్డిపల్లె గ్రామానికి చెందిన పార్శ రామలింగస్వామి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం పేరుతో కొంత మంది మాత్రమే లబ్దిపొందుతున్నారని, అనేక మందికి సంక్షేమ పథకాలు అందడం లేదంటూ వారికి వివిధ కారణాలను చూపి తొలగిస్తు న్నారని విమర్శించారు. నాటి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది తప్పా, ఎక్కడా మచ్చుకైనా అభివృద్ది కానరావడం లేదని దుయ్యబట్టారు. పార్టీలో చేరిన వారిలో ఇడమకంటి పెద్దఒన్నూరురెడ్డి, పార్శ పాండురంగయ్య, బెక్కెం రామయ్య, శెట్లం అనీల్, మోక్షగుండం పెద్దఅంకయ్య, పార్శ రంగయ్య, షేక్ చాంద్, బీరం విశ్వనాథరెడ్డి, డేరంగుల వైష్ణు, పార్శ రంగస్వామి, బిజ్జం శేఖర్ రెడ్డి, షేక్ దాదావలి, మోక్షగుండం చిన్న అంకయ్య, టీడీపీ నాయకులు బద్రి గోపాల్రెడ్డి, అల్లం రంగస్వామి, రామిరెడ్డి రంగారెడ్డి, కంకర వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దొడ్డంపల్లె నుంచి 20 కుటుంబాల చేరిక
మండలంలోని దొడ్డంపల్లె గ్రామానికి చెందిన సంగని వెంకటప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాని కి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. శుక్రవారం స్థానిక పార్టీ కార్యా లయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరందరికీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సంగని వెంకటరామిరెడ్డి, రామ కుమార్రెడ్డి, అంకిరెడ్డి, భాస్కర్రెడ్డి, బొర్రా నారా యణరెడ్డి, బాలుక్రిష్ణారెడ్డి, అంబటి భూపాల్రెడ్డి, జూటూరి ఖలీల్, ఎర్రంబట్టి బాలయ్య, సంగని రమణరెడ్డితోపాటు మండలపార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్, టీడీపీ నాయకులు కడియం శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
నాయీబ్రాహ్మణులకు అండగా ఉంటా
నాయీ బ్రాహ్మణులకు తాను అండగా ఉంటానని, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. స్థానిక నాయీబ్రాహ్మణుల కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నీటి సమస్య లేకుండా చొరవ చూపానని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సాధికార సమితి సభ్యులు పిలుట్ల సుధాకర్, జిల్లా సాధికార సమితి అధ్యక్షులు పాలూరి సత్యం, ఉదర రవికుమార్, కొణిదెల మోహన్రావు, గిద్దలూరు మండల నాయీబ్రాహ్మణ గౌరవాధ్యక్షులు వెంక టేశ్వర్లు, బి.రామయ్య, కె.చిన్నశింగరయ్య, పి.బాల రంగయ్య, అధ్యక్షులు తొండమల్లు బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు కె.ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు సయ్యద్ షహన్షావలి, టీడీపీ నాయకులు బిల్లా రమేష్యాదవ్, ఉలాపు బాలచెన్నయ్య, గుర్రం దానియేలు, బొంతా లక్ష్మీదేవి, ఫాతిమా తదిత రులు పాల్గొన్నారు.