Share News

స్థాయీ సంఘ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:25 PM

జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యతన ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో కనిగిరి, చీరాల, దర్శి, ఎర్రగొండపాలెం, శాసనసభ్యులు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింమారెడ్డి, ఎం.మాలకొండయ్య, డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, ఆయా సంఘాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.

స్థాయీ సంఘ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ
సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు

ఒంగోలు(కల్చరల్‌), జూన్‌ 23 : జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యతన ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో కనిగిరి, చీరాల, దర్శి, ఎర్రగొండపాలెం, శాసనసభ్యులు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింమారెడ్డి, ఎం.మాలకొండయ్య, డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, ఆయా సంఘాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. ముందుగా 2వ స్థాయీ సంఘమైన గ్రామీణాభివృద్ధి శాఖ, 1,7 స్థాయీ సంఘాలైన పనులు, ఆర్థిక విషయాలపై సమీక్షించారు. అనంతరం 3,4 స్థాయీ సంఘాలు వ్యవసాయం, విద్య, వైద్యంపై, 5,6 స్థాయీ సంఘాలైన స్ర్తీ,శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం మొదలైన శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఉప ముఖ్యకార్యనిర్వహణాధికారి సి.హనుమంతరావు, మారెడ్డి అరుణ, చుండి సుజ్ఞానమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 11:25 PM