దళిత ద్రోహి జగన్రెడ్డి
ABN , Publish Date - May 12 , 2024 | 12:39 AM
ళితులను ఘోరం గా మోసం చేసిన సీఎం జగ న్మోహన్రెడ్డి దళిత ద్రోహి అ ని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు ఆరోపించారు.

మాలల మద్దతు టీడీపీకే..
మాలమహాసభ అధ్యక్షుడు వెంకట్రావు
ఒంగోలు (కార్పొరేషన్), మే 11: దళితులను ఘోరం గా మోసం చేసిన సీఎం జగ న్మోహన్రెడ్డి దళిత ద్రోహి అ ని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు ఆరోపించారు. శనివా రం ఒంగోలులోని ఎంసీఏభవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలలను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుని అధికా రంలోకి వచ్చిన జగన్రెడ్డి, పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టారని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ను మూడుగా విడగొట్టి పైసా నిధులు ఇవ్వ కుండా నిర్వీర్యం చేశారన్నారు. గడచిన ఐదేళ్ళలో దళితులు అన్ని విధాలుగా న ష్టపోయారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలు చేసిన అంబేడ్కర్ విదేశీ విద్య పథకాని కి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకోవడం దుర్మార్గమన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్ళించి, తన సొంత ప థకాలకు వాడుకున్నారని విమర్శించారు. దళితుల పట్ల వివక్ష చూపుతున్న జ గన్రెడ్డిని ఓడించడానికి రాష్ట్రంలోని మాలలందరూ సిద్ధం కావాలన్నారు. తెలు గుదేశం ప్రభుత్వం హయాంలో మాల, మాదిగల సంక్షేమం సాధ్యప డిందని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ను అత్యధిక నిధులు కేటాయించడంతో పాటు, రుణాలు అందజేశారని, ఇన్నోవా కార్లు, వృత్తి పరికరాలు, వ్యాపారాలు చేసుకు నేందుకు, దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం నిధులు కేటా యించి అండగా నిలిచిన చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి కావాలని కోరారు. టీడీపీ హయాంలో మాల, మాదిగలు ఆర్థికపురోభివృద్ధి సాఽధించారన్నారు. అ లాగే విద్యార్ధులకు ఫీజు రీయంబర్సుమెంట్ నేరు గా కాలేజీలకే వేయడం ద్వా రా ఎలాంటి ఆర్థికభారాలు లేకుండా విద్యార్ధులు చదువులు పూర్తి చే సుకు న్నారని తెలిపారు. దళితులకు సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, ఎ న్నికల్లో మాలలు కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.