గుండ్లకమ్మ ప్రాజెక్టులో మొసలి !
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:47 AM
మద్దిపాడు మండ లం గుండ్లకమ్మ ప్రాజె క్టులో చేపల వేట సాగి స్తున్న మత్స్యకారుల వలలో మొసలి పడింది. ఒడ్డుకు లాగే సరికి అది మృతి చెందింది.
మత్స్యకారుల వలకు చిక్కి మృతి
మద్దిపాడు, మార్చి 28 : మద్దిపాడు మండ లం గుండ్లకమ్మ ప్రాజె క్టులో చేపల వేట సాగి స్తున్న మత్స్యకారుల వలలో మొసలి పడింది. ఒడ్డుకు లాగే సరికి అది మృతి చెందింది. అందిన సమాచారం మేరకు మ త్స్యకారులు రిజర్వాయర్లో బుధవారం రాత్రి చేపల వేటకు వెళ్లి వల వేశారు. కొద్దిసేపటికి వల బరువుగా ఉండటంతో అనుమానించారు. మరికొందరు జాల ర్లను కూడా పిలిచి బయటకు లాగారు. అయితే వలకు ఉన్న హుక్కు మొసలి నోట్లోకి వెళ్లడంతో అది మృతి చెందింది. ఈమేరకు మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అటవీశాఖ అధికారులకు చేరవేశారు.