Share News

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:24 PM

నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ఆద రించాలని ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి

పెద్దదోర్నాల, మార్చి 28: నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ఆద రించాలని ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని హసనాబాద్‌ గ్రామంలో గురువారం వైసీపీని వీడి 35 కుటుంబాలు టీడీపీలో చేరాయి. గ్రామానికి చెందిన ఎలకపాటి చంచయ్య, ఒంటేరు ఎర్రయ్య ఆధ్వర్యంలో బుస్సా నాగిరెడ్డి, రామకృష్ణా రెడ్డి తదితరులు గూడూరి ఎరిక్షన్‌ బాబు , కందుల రామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి గూడూరి, కందుల టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంధర్భంగాఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఎన్ని కల్లో టీడీపీ జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతార న్నారు. ఈ క్రమంలో తనను ఆదరించి న ఈ ప్రాంతం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గత రెండేళ్లుగా నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించా నని సమస్యలు తెలుసుకు న్నానన్నారు. అన్ని గ్రామా ల్లో తనను పెద్దఎత్తున ప్రజలు ఆదరిస్తుండడం హర్షనీయమన్నారు. కూట మి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు చేయనున్నల్లు తెలిపారు. పార్టీ విజయానికి ఐఖ్యంగా తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్‌ భాష, ఇస్మాయిల్‌,షేక్‌ మంజూర్‌ భాష, కే రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

3ం కుటుంబాల చేరిక

పుల్లలచెరువు : మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. మండలంలోని అక్కపాలెం నుంచి పది కుటుం బాలు, మర్రివేముల నుంచి ఇరవై కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరిక్షన్‌బాబు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం గ్రామంలో అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులకు అక్కపాలెం గ్రామం ఎక్కడ వుందో తెలుసా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌, జనసేన మండల అధ్యక్షుడు అచ్చయ్యనాయుడు, మాజీ ఎంపీపీ మాకం సుందరరావులు టీడీపీ నాయకులు దోరకచర్ల అంజిరెడ్డి టీడీపీ మండల నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, మానేపల్లి, కవలకుంట్ల సర్పంచులు రమణారెడ్డి ,వెంకటరెడ్డి, నాయకులు యర్రయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:24 PM