Share News

చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:12 PM

ఇంకొల్లులో ఈనెల 17న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న రా కదిలిరా కార్యక్రమానికి నేతలు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం అడ్డరోడ్డు వద్ద గల ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బల్లికురవ మండలం ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామ టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలి
ఎస్‌ఎల్‌ గుడిపాడు నేతలతో మాట్లాడుతున్న ఎమ్మేల్యే రవికుమార్‌

బల్లికురవ, ఫిబ్రవరి 13: ఇంకొల్లులో ఈనెల 17న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న రా కదిలిరా కార్యక్రమానికి నేతలు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం అడ్డరోడ్డు వద్ద గల ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బల్లికురవ మండలం ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామ టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబు బహిరంగ సభకు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అలాగే, వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా చేపట్టిన పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన టీడీపీ, జనసేన పార్టీల కూటమి విజయం తథ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుందన్నారు. ఓటమి తప్పదని భావించిన జగన్‌రెడ్డి ఉద్యోగులను మార్చిన విధంగా, అభ్యర్థులను అంతర్‌ జిల్లాల బదితీలు చేస్తున్నారని అయన విమర్శించారు. పార్టీ నేతలంతా సమిష్టిగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రవికుమార్‌ పిలుపు నిచ్చారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కొండేటి ఇజ్రాయల్‌, రావులపల్లి గోవిందు, సంపతి శౌరి, తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

అద్దంకి : ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం పలు కార్య క్రమాలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు ఇంకొల్లు లో రా...కదిలి రా సభా ప్రాంగణం పరిశీలన, 11.30 గంటలకు అద్దంకి పట్టణంలోని 7వ వార్డు, 11.45కి 14వ వార్డు, మధ్యాహ్నం 12 గంటలకు ఉప్పలపాడులో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 10:12 PM