ఏలూరికి బ్రహ్మరథం
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:29 PM
కారంచేడు మండలం కుంకలమర్రులో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఏలూరికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షంతో గ్రామంలోకి సాధరంగా ఆహ్వానించి అభిమానం చాటుకున్నారు.
ఆకట్టుకున్న ఎడ్లబండి ప్రచారం
ఘనస్వాగతం పలికిన కుంకలమర్రు గ్రామస్థులు
కుంకలమర్రు(పర్చూరు), ఏప్రిల్ 26 : కారంచేడు మండలం కుంకలమర్రులో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఏలూరికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షంతో గ్రామంలోకి సాధరంగా ఆహ్వానించి అభిమానం చాటుకున్నారు. పెద్దఎత్తున మహిళలు తరలి వచ్చి హారతులతో దీవించారు. అభివృద్ధి ప్రదాత మా ఏలూరి అంటూ యువత జేజేలు పలికారు. ఏలూరికి గజమాలతో మహిళలు సత్కరించి అభిమానం చాటుకున్నారు. ఏలూరి ప్రచారానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీతోపాటు, ఏలూరి అభిమానులు తరలి రావడంతో ప్రధాన వీధులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. కార్యక్రమంలో భాగంగా మసీదులో ముస్లింలు ఏలూరి గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏలూరికి కుంకలమర్రు గ్రామస్థులు అడ గడునా నీరాజనాలు పలికారు. మాఓటు మీకేనయ్యా అంటూ వృద్ధులు ఏ లూరిని ఆప్యాయంగా పలుకరిస్తూ దీవించారు. ఈ సందర్భంగా ఏలూరి కుం కలమర్రులో ఎడ్లబండిపై ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ బా పట్ల పార్లమెంట్ అధ్యక్షుడు సలగల రాజశేఖర్బాబు, తెలుగుదేశం, జనసేన, బీసేపీ ప్రజా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.