Share News

ఆశీర్వదించండి.. వలసల నివారణకు కృషి చేస్తా

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:15 PM

వచ్చే ఎన్నికల్లో ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వలసల ని వారించి తీరుతానని కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. బెంగళూరులో కనిగిరి ప్రాంత ప్రజలు, వ్యాపారుల, పారిశ్రామికవేత్తలతో సోమవారం ఆత్మీ య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కనిగిరిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా అనువుగా ఉందన్నారు. కనిగిరి ప్రాంతంలో ఫార్మాహబ్‌ను ఏర్పాటు చేసేందు కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఆశీర్వదించండి.. వలసల నివారణకు కృషి చేస్తా
బెంగళూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఉగ్ర

బెంగళూరులో కనిగిరి ప్రాంత ప్రజల ఆత్మీయ సమావేశంలో

టీడీపీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి

కనిగిరి, ఫిబ్రవరి 26 : వచ్చే ఎన్నికల్లో ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వలసల ని వారించి తీరుతానని కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. బెంగళూరులో కనిగిరి ప్రాంత ప్రజలు, వ్యాపారుల, పారిశ్రామికవేత్తలతో సోమవారం ఆత్మీ య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కనిగిరిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా అనువుగా ఉందన్నారు. కనిగిరి ప్రాంతంలో ఫార్మాహబ్‌ను ఏర్పాటు చేసేందు కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కనిగిరిలో నిమ్జ్‌ ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాది లభించడంతో పాటు ఉద్యోగావకాశాలు పొందవచ్చన్నారు. నిమ్జ్‌, ఫార్మా వస్తే ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వె ళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌రెడ్డి అన్నివర్గాల ప్రజల ను నిండా ముంచారన్నారు. రాష్ట్రంలో ఒక్క కంపెనీని కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిరుద్యోగులు ఎక్కువై వసలు పెరిగిపోయా యని ఉగ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మరోసారి పొరపాటు జరగకుండా పాలనాదక్షత ఉన్న చంద్రబాబు ను సీఎంగా ఎన్నుకోవాలని ఉగ్ర విజ్ఞప్తి చేశా రు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేది మీ ఓటేనని చెప్పారు. కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు సాధించాలనే తపన, సంకల్పం ఉండాలన్నారు. అప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. తనపై నమ్మకంతోనే చంద్ర బాబు తొలిజాబితాలో టికెట్‌ను కేటాయిం చారన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ముచేయ కుండా మీరంతా తనను ఆశీర్వదించి పంపాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న కనిగిరి ప్రజలంతా తనకు అండగా ఉండాలని విన్న వించారు. తనను గెలిపిస్తే వలసల నివారణకు తొలిప్రాధాన్యతను ఇస్తానన్నారు. తొలుత కనిగిరి ప్రాంతానికి చెందిన బెంగళూరు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు డాక్టర్‌ ఉగ్రకు అపూర్వ స్వాగతం పలికారు. డాక్టర్‌ ఉగ్రను దుశ్వాలువాలతో సత్కరించారు. వచ్చే ఎన్నికల్లో తామందరం మీ వెంట ఉండి గెలిపించుకుంటామని హామీనిస్తూ అఖండమెజార్టీతో గెలిపించి టీడీపీ జెండాను ఎగురవేద్దామని ప్రతిజ్ఞ చేశారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ మండలపార్టీ కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లుయాదవ్‌, సానికొమ్ము తి రుపతిరెడ్డి, పువ్వాడి వెంకటేశ్వర్లు, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, వేమూరి రామయ్య, పట్టణపార్టీ అధ్యక్షుడు త మ్మినేని శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 11:15 PM