Share News

నేడు భువనేశ్వరి పరామర్శ

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:59 PM

మా జీ ముఖ్యమంత్రి చందబ్రాబు స తీమణి నారా భువనేశ్వరి నేడు మండలంలోని తూర్పుగంగవ రం పంచాయతీ గుంటిగంగ వృ ద్ధాశ్రమంలో టీడీపీ కార్యకర్త కు టుంబానికి భరోసా ఇచ్చేందుకు వస్తున్నారు. ‘నిజంగెలవాలి యా త్ర’ కార్యక్రమ ఏర్పాట్లను దర్శి నియోజవర్గ టీడీపీ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, టీడీపీ నాయకులు మంగళవారం పరిశీలించారు.

నేడు భువనేశ్వరి పరామర్శ

తాళ్లూరు, జనవరి 30 : మా జీ ముఖ్యమంత్రి చందబ్రాబు స తీమణి నారా భువనేశ్వరి నేడు మండలంలోని తూర్పుగంగవ రం పంచాయతీ గుంటిగంగ వృ ద్ధాశ్రమంలో టీడీపీ కార్యకర్త కు టుంబానికి భరోసా ఇచ్చేందుకు వస్తున్నారు. ‘నిజంగెలవాలి యా త్ర’ కార్యక్రమ ఏర్పాట్లను దర్శి నియోజవర్గ టీడీపీ పరిశీలకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, టీడీపీ నాయకులు మంగళవారం పరిశీలించారు. మార్కాపురం గ్రామానికి చెందిన టీడీపీ వీరాభిమాని జంపాల నరసింహారావు చంద్రబాబు అరెస్టుతో కలతచెంది మృతి చెందారు. అతనికి సం తానం లేదు. ఆయన భార్య ప్రసన్నలక్ష్మి ఒంటరిగా ఉండలేక గుంటిగంగ ఆవ రణలోని తేజ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ప్రసన్నలక్ష్మికి భరోసా ఇచ్చేందుకు భువనేశ్వరి బుధవారం రానున్నారు. కార్యక్రమంలో టీ డీపీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, దర్శి, ముండ్లమూరు మండలాల టీ డీపీ అధ్యక్షులు సీహెచ్‌.వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసరావు, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులు శాగం కొండారెడ్డి, మానం రమే్‌షబాబు, వల్లభనేని సు బ్బయ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, ముస్లిం మై నారిటీ కార్యదర్శి షేక్‌ కాలేషావలి, టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జిలు రాచకొండ వెంకట్రావు, కైపు నాగార్జునరెడ్డి, టీడీపీ గ్రామపార్టీ అధ్యక్షులు రామలక్ష్మయ్య, పుట్టా నరసింహారావు, నుసుం ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.

సింగనపాలెంకు రాక..

ముండ్లమూరు : మండలంలోని సింగనపాలెంకు బుధవారం ఉదయం 11 గం టలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వస్తున్నట్టు టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై బత్తిన హనుమంతరావు మృతి చెందారు. ఆ కుటుంబా న్ని భువనేశ్వరి పరామర్శించేందుకు వస్తున్నట్టు తెలిపా రు. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.

Updated Date - Jan 30 , 2024 | 10:59 PM