‘సింగరాయకొండ’పై బెట్టింగ్లు !
ABN , Publish Date - May 17 , 2024 | 12:31 AM
ష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం గెలుపోటములపై బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. సింగరాయకొండ మండలంలో టీడీపీకి ఆధిక్యత వస్తుందని ఆ పార్టీ నాయకులు, వైసీపీకి మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు.
మండలంలో మెజారిటీపై టీడీపీ, వైసీపీ ధీమా
కూటమితోపాటు కొండపిలో స్వామి గెలుపుపై పందేలకు
అధికారపార్టీ నేతలు వెనుకంజ
సింగరాయకొండ, మే 16 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం గెలుపోటములపై బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. సింగరాయకొండ మండలంలో టీడీపీకి ఆధిక్యత వస్తుందని ఆ పార్టీ నాయకులు, వైసీపీకి మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. దీంతో 10 గ్రామాల్లో జరిగిన పోలింగ్ సరళిని అంచనా వేసుకొని ఇరుపార్టీ నేతలు పందెలు కాస్తున్నారు. మండలంలో పో స్టల్ బ్యాలెట్తో కలుపుకొని ఒక్క ఓటైనా తమ పార్టీకి మెజారిటీ వస్తోందని టీడీపీ, తమకే వస్తోందని వైసీపీ నేతలు గురువారం రూ.25 లక్షలు పందెం కాసుకున్నారు. పాతసింగరాయకొండ పంచాయతీలో వైసీపీకి ఒక్క ఓటైనా మెజారిటీ వస్తోందని పోలింగ్ ముందురోజు వైసీపీ నేతలు రూ.3 లక్షలు బెట్టింగ్ కాశారు. రాదని టీడీపీ నేతలు రూ.3 లక్షలు పందెం పెట్టారు. పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ నేతలు పాతసింగరాయకొండలో టీడీపీదే ఆధిక్యతని ఒకటికి మూడింతలు ఇస్తామని ముం దుకు వచ్చారు. దీనిపై వైసీపీ నేతలు వెనక్కి తగ్గుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూట మి అధికారంలోకి వస్తోందని, కొండపిలో తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు ఎంతైనా పం దెలు కాయడానికి సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు మాత్రం ఆరెండింటిపై మేము బె ట్టింగ్లు పెట్టలేమని చేతులెత్తేశారు.