Share News

ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:39 AM

రానున్న సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి

గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 25 : రానున్న సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆదే శించిన ప్రతి కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయ వంతంగా పూర్తి చేయాలని, మరో 50 రోజుల్లో ఎన్నికలు రానున్న దృష్ట్యా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయనున్నట్లు తెలిపారు. ఎవరు ఎన్ని జిమ్మి క్కులు చేసినా, అవాక్కులు, చవాక్కులు పేల్చినా టీడీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానన్నారు. ఈ నెల 27వ తేది మంగళవారం పట్టణంలోని షాధీఖానాలో నియోజక వర్గస్థాయి ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు. ముస్లిం మైనారిటీలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 2, 3 తేదీలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, గిద్దలూరు రానున్నారన్నారు. నియోజకవర్గంలోని తెలుగు దేశం, జనసేన కుటుంబసభ్యులతో ఆయన సమావేశ మవుతారన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్నిప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే టీడీపీ, జనసేనల ఉమ్మడి మానిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ పాలన లో జరిగిన అరాచక పాలనను, దోపిడిని ప్రజలు తెలుసు కున్నారని, రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం టీడీపీ, జనసేనల ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమవు తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధ్యక్షులు మౌలానా ముస్తక్‌ అహమ్మద్‌, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌యాదవ్‌, కాపు నాయకు లు దుత్తా బాలీశ్వరయ్య, మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:39 AM