Share News

బీసీ, టీఎన్‌టీయూసీ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 27 , 2024 | 10:42 PM

చినగంజాం గ్రామంలో మార్చి 5న బాపట్ల పార్లమెంట్‌ స్థాయిలో జరిగే టీడీపీ బీసీ, టీఎన్‌టీయూసీ ఆత్మీయ సమావే శాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీర య్య పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయ ఆవరణలో టీడీపీ మండల బీసీ సం ఘం అధ్యక్షుడు వాటుపల్లి ఏడుకొండలు అధ్యక్షతన మంగళవారం జరిగిన బీసీ, టీఎన్‌టీయూసీ నాయకులు, కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బీసీ, టీఎన్‌టీయూసీ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న టీడీపీ మండల అధ్యక్షుడు వీరయ్య

చినగంజాం, ఫిబ్రవరి 27 : చినగంజాం గ్రామంలో మార్చి 5న బాపట్ల పార్లమెంట్‌ స్థాయిలో జరిగే టీడీపీ బీసీ, టీఎన్‌టీయూసీ ఆత్మీయ సమావే శాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీర య్య పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయ ఆవరణలో టీడీపీ మండల బీసీ సం ఘం అధ్యక్షుడు వాటుపల్లి ఏడుకొండలు అధ్యక్షతన మంగళవారం జరిగిన బీసీ, టీఎన్‌టీయూసీ నాయకులు, కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలోఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా బీసీ యాదవ సాధికార సమితి కన్వీనర్‌ నక్కల వీరరాఘవులు, పర్చూరు ని యోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు నరహరి శ్రీనివాసరావు తెలిపారు. కా ర్యక్రమంలో చినగంజాం గ్రామ సర్పంచ్‌ రాయని ఆత్మారావు, నాయకులు కొం డ్రగుంట శ్రీహరి, వీ .వెంకయ్య, ఎన్‌వీ నారాయణ, యార్లగడ్డ లక్ష్మి, అబ్దుల్‌ కలాంఅజాద్‌, మోటుమర్రి రామసుబ్బారావు, సందు శ్రీనివాసరావు, దండుప్రోలు తిరుపతిరావు, కే.రామాంజనేయులు, కే.విష్ణు, పిచ్చయ్య, బాలరాజు, షేక్‌ జిలాని, షేక్‌ ఖాదర్‌బాషా, కే.రాముడు, పైనం సుబ్బారావు, పిల్లి కృష్ణ, రా జు వెంకటేశ్వరరెడ్డి, టి.చిన్నా, కుక్కల వెంకటేశ్వరరెడ్డి, జి.నరసింహారావు, గో పాలం, పట్టాభి వెంకటేశ్వర్లు, టీఎన్‌టీయూసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 10:42 PM