Share News

టీడీపీకి ఓటు వేశాడని కొడవలితో దాడి

ABN , Publish Date - May 16 , 2024 | 11:17 PM

ఎన్నికల తర్వాత వైసీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారనే అక్కసుతో ఆ పార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తపై కొడవలిలో దాడి తెగబడ్డారు. ఈ ఘటన మండలంలోని పందువ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

టీడీపీకి ఓటు వేశాడని కొడవలితో దాడి
దాడిలో గాయపడ్డ తిమోతి

వెలిగండ్ల, మే 16 : ఎన్నికల తర్వాత వైసీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారనే అక్కసుతో ఆ పార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తపై కొడవలిలో దాడి తెగబడ్డారు. ఈ ఘటన మండలంలోని పందువ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. పందువ గ్రామానికి చెందిన జుటికే తిమోతి వైసీపీని వీడి టీడీపీలో చేరాడు. పార్టీలో చురుగ్గా పనిచేస్తూ తమ కుటుంబీకులు, బంధువుల ఓట్లను టీడీపీకి వేయించాడు. దీంతో కోపం పెంచుకున్న వైసీపీకి చెందిన గురవయ్య కాపుకాచి తిమోతిపై కొడవలితో దాడిచేశాడు. ఇది గమనించిన తిమోతి పక్కకు వరగడంతో చెవి భాగానికి తగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడ్ని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెవిభాగంలో నాలుగు కుట్లు పడ్డాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెలిగండ్ల పోలీసులు తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 11:17 PM