Share News

అంగన్‌వాడీలపై పోలీసులు ఉక్కుపాదం

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:52 PM

తమ సమస్యల పరి ష్కారం కోసం అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు నెల రోజు లు పైగా చేస్తున్న ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

 అంగన్‌వాడీలపై పోలీసులు ఉక్కుపాదం


200 మందికి నోటీసులు

ఒంగోలు(క్రైం), జనవరి18: తమ సమస్యల పరి ష్కారం కోసం అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు నెల రోజు లు పైగా చేస్తున్న ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శుక్రవారం విజయవాడలో జరగనున్న ధర్నా కార్యక్రమానికి జిల్లా నుంచి ఎవరూ వెళ్ళకుండా పోలీ సులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గు రువారం రాత్రి నుంచి ముఖ్యమైన నాయకులపై నిఘా ఉంచారు. అంతేకాకుండా విజయవాడ వెళ్ల కూడదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ముందస్తు అరెస్టులు చేయాలని పోలీసు ఉన్నతాధికారు లు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయా మండలాల్లోని ము ఖ్యమైన యూనియన్‌ నాయకుల ఇళ్ళ వద్దకు వెళ్ళిన పోలీ సులు నోటీసులు అందజేశారు. ఈ విధంగా సుమారు 200 మందిని గుర్తించి వారిపై పూర్తిగా నిఘా ఉంచారు.

Updated Date - Jan 18 , 2024 | 11:52 PM