Share News

కరోనాపై అప్రమత్తం

ABN , Publish Date - Jan 17 , 2024 | 10:02 PM

ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణ ప్రజల సౌకర్యార్థం నూతనంగా మంజూరైన పారిశుధ్య వాటర్‌ ట్యాంకర్‌ను నాగార్జునరెడ్డి బుధవారం ప్రారంభించారు.

కరోనాపై అప్రమత్తం
ట్రాక్టర్లు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం వన్‌టౌన్‌, జనవరి 17: ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణ ప్రజల సౌకర్యార్థం నూతనంగా మంజూరైన పారిశుధ్య వాటర్‌ ట్యాంకర్‌ను నాగార్జునరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం పొందాలన్నారు. రూ.20.80 లక్షలతో మంజూరైన ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంకు ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో చైర్మన్‌ బాలమురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌, అంజమ్మ, కమిషనర్‌ డి.రవీంద్ర, డీఈ షేక్‌ సుభానీ, ఏఈ ఆదినారాయణ, మేనేజర్‌ శ్రీనివాసన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రసూల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 10:02 PM