Share News

ముమ్మరంగా కూటమి శ్రేణుల ప్రచారం

ABN , Publish Date - May 03 , 2024 | 12:07 AM

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గురువారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు. వేటపాలెం, దేశాయిపేట, ఐటీఐ కాలనీ, రామానగర్‌, చల్లారెడ్డిపాలెం కొత్తపాలెం, హరిప్రసాద్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

ముమ్మరంగా కూటమి శ్రేణుల ప్రచారం
ప్రచారంలో చంటి బిడ్డతో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య ...హీరో నిఖిల్‌

కొండయ్య ఇంటింటి ప్రచారం

చీరాల, మే 2 : టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గురువారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు. వేటపాలెం, దేశాయిపేట, ఐటీఐ కాలనీ, రామానగర్‌, చల్లారెడ్డిపాలెం కొత్తపాలెం, హరిప్రసాద్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఒక వైపు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ మరో వైపు ఆయా ప్రాంతాల్లోని ముఖ్యులతో ఆంతరింగిక సమావేశాలు నిర్వహించారు. ఆయా సందర్భాల్లో ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్‌ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కొం డయ్య కోరారు. అనంతరం చీరాల మండలం జాండ్రపేటలో పలువురు ప్రముఖులను కలిశారు. అనంతరం పట్టణంలో 23, 25, 26 వార్డులలో ఇంటింటి ప్రాచరం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీసీ డిక్లరేషన్‌తో సువర్ణాధ్యాయం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో సువర్ణాధ్యాయానికి శ్రీకారం పలికారని టీడీపీ కూటమి అభ్యర్థి కొండయ్య కుమార్తె గోరిపర్తి శివనారాయణదేవి అన్నారు. తన తండ్రి కొండయ్యకు మద్దతుగా బుధవారం వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురంలో నాయకులు, కార్యకర్తలతో క లసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రధానంగా బీసీ డిక్లరేషన్‌తో కలిగే ప్రయోజనాలను వివరించారు. కూటమి ఉమ్మ డి మేనిఫెస్టోలో ఇచ్చి న హామీలతో ప్రతి ఒ క్కరూ ఆర్థికంగా, సా మాజికంగా బలోపేతం అవుతారన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండయ్య ను సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కారకర్తలు పా ల్గొన్నారు.

మామయ్యను గెలిపించండి - హీరో నిఖిల్‌

మా మామయ్య, టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండయ్య ను సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రముఖ సినీహీరో నిఖిల్‌ సిద్ధార్థ పిలుపునిచ్చారు. కొండయ్యకు మద్దతుగా గురువారం నిఖిల్‌ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా కృష్ణప్రసాద్‌ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండయ్యను సైకిల్‌ గుర్తులపై ఓట్లువేసి గెలిపించాలని కోరారు. నిఖిల్‌తో సెల్ఫీలు దిగేందుకు పలు వురు పోటీపడ్డారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

చీరాలటౌన్‌ : కొండయ్యను గెలి పించాలని సినీహీరో నిఖిల్‌ పట్టణంలో ప్రచారం చేశారు. పొలిమేర రోడ్డులోని జానకి హోటల్‌లో సాధారణ వ్యక్తిలా టిఫిన్‌ చేస్తూ ప్రచారం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయి అభివృద్ధిని పరుగు పెట్టిస్తారని హీరో నిఖిల్‌ తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 12:07 AM