Share News

అధికారంలోకి రాగానే వెలిగొండ పూర్తి

ABN , Publish Date - May 07 , 2024 | 01:35 AM

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగ చిరకాల కోరికను తీరుస్తామని టీడీపీ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు.

అధికారంలోకి రాగానే వెలిగొండ పూర్తి

పుల్లలచెరువు, మే 6: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగ చిరకాల కోరికను తీరుస్తామని టీడీపీ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. సోమవారం పుల్లలచెరువు మండలం మల్లాపాలెం, వెంకట రెడ్డిపల్లి, రాచకొండ, వెంకటరెడ్డిపల్లె, ఉమ్మడి వరం గ్రామాల్లో టీడీపీ కూటమి అభ్యర్ధి ఎరిక్షన్‌బాబుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో టి5కు రాష్ట్ర ప్రభుత్వం రూ.83 కోట్లతో బూటకపు జీవో ఇచ్చి రైతుల ఆశలుపై నీళ్లు చల్లారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీ5 పను లు మొదలు పెడతామన్నారు. ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికైన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. రాచకొండ పంచాయతీ ఉమ్మడివరంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్య క్షుడు పయ్యావుల ప్రసాద్‌, టీడీపీ నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, కాకర్ల కోటయ్య, శనగా నారాయణరెడ్డి, మేడికొండ లక్ష్మినారాయణ, కుమార్‌, గజ్వేల్లి భాస్కర్‌, మునగాల రామిరెడ్డి, గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉప్పల హనుమంతు, ఎంపీటీసీ రాధ,కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలో 20 కుటుంబాల చేరిక

పుల్లలచెరువు : మండలంలోని వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. శనివారం మల్లాపాలెంలో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో మండలం లోని పెద్దపీఆర్‌సీ తాండ పంచాయతీలోని చిన్న పీఆర్‌సీ తాండ ఉపసర్పంచి దేవసోత్‌ చిన్న మంత్రునాయక్‌ ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 20 కుంటుంబాలకు వారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాక్ష్యడు పయ్యావుల ప్రసాద్‌, కాకర్ల కోటయ్య, శనగా నారాయణరెడ్డి, టీడీపీ మండల నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : ఎన్నికల ప్రచారంలో భాగంగా దోర్నాలలో మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎరిక్షన్‌ బాబులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయను న్నట్లు తెలిపారు. గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లా డుతూ టీడీపీ ప్రభుత్వంలో పేదవర్గాల ప్రజల అభివృద్ధి కోసం అమలు చేసిన పథకా లన్నీ జగన్‌మోహన్‌రెడ్డి రద్దు చేశారని ఆరోపించారు. వెలిగొండ కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తామ న్నారు. గ్రామాల్లో కనీసం గుక్కెడు తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం అవసరమా అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏర్వ మల్లికార్జున రెడ్డి, నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి,షేక్‌ సమ్మద్‌ భాష, చల్లా వెంకటేశ్వర్లు, షేక్‌ ఇస్మాయిల్‌, భాష, ఎలకపాటి చంచయ్య, కె శ్రీనివాసులు, కే సుబ్బారెడ్డి, షేక్‌ మంజూర్‌ భాష తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : పశ్చిమ ప్రకాశానికి తాగునీరు, సాగునీరు కావాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసే నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం టీడీపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించి ప్రజలకు అభివాదం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు, మీ భిడ్డల భవిష్యత్‌ బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్‌ బాబు సైకిల్‌ గుర్తు పై ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని గురిజేపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, వేగినాటి శ్రీను, వెన్నా వెంకిరె డ్డి, కందుల నారాయణరెడ్డి గ్రామప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 01:35 AM