ప్రచారంలో పాల్గొన్న ఆర్పీలపై వేటు
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:07 AM
న్నికల నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు ఆర్పీలపై వేటు పడింది. వారి లాగిన్లను మెప్మా అధికారులు నిలిపివేశారు.
వారి లాగిన్ నిలిపివేత
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
ఒంగోలు (కార్పొరేషన్), ఏప్రిల్19 : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు ఆర్పీలపై వేటు పడింది. వారి లాగిన్లను మెప్మా అధికారులు నిలిపివేశారు. ఒంగోలులో కొందరు ఆర్పీలు వైసీపీ ప్రచారంలో పాల్గొనడంపై ‘కొందరికే కోడ్’ అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఈనెల 17న కథనం ప్రచురితమైంది. దీనిపై ఎన్నికల అధికారులు స్పందించినట్లు సమాచారం. వారి ఆదేశాలతో మెప్మా అధికారులు చర్యలు చేపట్టారు. వైసీపీ ప్రచారంలో పాల్గొన్న ఆర్పీలు సంధ్యారాణి, సుజాతల లాగిన్లను నిలిపివేసినట్లు సమాచారం. అలా చేయడమంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లే. త్వరలోనే అందుకు సంబంధించి మెప్మా ఎండీ నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.