వైసీపీ ర్యాలీలో పాల్గొన్న వలంటీర్
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:37 PM
ఎ న్నికల కార్యక్రమాల్లో వలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘంఆదేశించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. వైసీపీ నేతల అండదండలు ఉన్నందున తమకేమి కాదన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు.
తాళ్లూరు, ఏప్రిల్ 18: ఎ న్నికల కార్యక్రమాల్లో వలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘంఆదేశించినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. వైసీపీ నేతల అండదండలు ఉన్నందున తమకేమి కాదన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో గురువారం బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామినేషన్ సందర్భంగా బొద్దికూరపాడుకు చెందిన వలంటీర్ కె.రాజారెడ్డి గ్రామ వైసీపీ నేతలు నిర్వహించిన ర్యాలీ పాల్గొని దర్శికి వెళ్లారు.