Share News

టీడీపీలో చేరిన వలంటీర్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:11 PM

కంభం మండలం లింగాపురం గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్న మిట్టా విద్యాసాగర్‌ వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిన వలంటీర్‌
వలంటీర్‌ పదవికి రాజీనామా చేసి ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన విద్యాసాగర్‌

గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 15 : కంభం మండలం లింగాపురం గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్న మిట్టా విద్యాసాగర్‌ వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. విద్యాసాగర్‌కు అశోక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మిట్టా ప్రసాద్‌, దూదేకుల ఖాశింసాహెబ్‌, జె.కేశవులు, ఎ.శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:11 PM